గుంటూరు రైల్వే స్టేషన్లోని 1వ నంబర్ ప్లాట్ఫారమ్ ట్రాక్పై శుక్రవారం ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. రైలు ఢీకొనడం వల్లే సుమారు 35 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు మెరూన్, తెల్ల రంగు బొమ్మలున్న చొక్కా ధరించి ఉన్నదని ఆచూకీ తెలిసినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
CTR: నిర్దిష్టమైన ఓటర్ల జాబితా తయారీకి అందరి సహకారం అవసరమని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కరుణ కుమారి తెలిపారు. పుంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై సమీక్షించారు. తర్వాత రాజకీయ నాయకులు వారి వారి సలహాలు సూచనలు ఇచ్చారు.
PPM: క్రీడా పాఠశాలల ప్రవేశాల కోసం ఈ నెల 23 నుంచి జిల్లా స్థాయి ఎంపిక నర్సిపురం ZP హైస్కూలులో నిర్వహిస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈనెల 23న పార్వతీపురం, సీతానగరం,బలిజిపేట,24న గుమ్మలక్ష్మీపురం,కురుపాం, జియమ్మవలస,25న గరుగుబిల్లి, కొమరాడ,వీరఘట్టం,26న భామిని, సీతంపేట,పాలకొండ,27 సాలూరు, పాచిపెంట, మక్కువ వారు హాజరుకావాలన్నారు.
VZM: ఉత్తరాంధ్రలో మూత పడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలను,రైతులను,కార్మిక కుటుంబాలను ఆదుకునే దిశగా రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక చర్చ జరిగేలా చూడాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. ఈ మేరకు ప్రభుత్వ పరిశ్రమలు కార్యదర్శి డా ఎన్.యువరాజ్, రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ వి.వెంకటరావు లను శుక్రవారం సచివాలయంలో కలసి వారికి వినతిపత్రం అందజేశారు.
TPT: హైదరాబాద్కు చెందిన శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ. 50 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళంగా చెక్కును అందజేశారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో దాత కుటుంబ సభ్యులను అభినందించారు.
SKLM: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి పలు సమస్యల పై దరఖాస్తు రూపంలో వినతులు స్వీకరించారు. వినతులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
VSP: కలెక్టర్ ఆఫీస్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా శ్రీ వెంకటేశ్వర వాటర్ సప్లైకి చెందిన వాహనం ముందుభాగం తీవ్రంగా దెబ్బతిన్న ఘటన ఆందోళన కలిగించింది. స్పీడ్ బ్రేకర్ వద్దే వాహనం నుజ్జునుజ్జు కావడం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్లు సక్రమంగా ఉన్నాయా? తగిన తనిఖీలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
KRNL: మాజీ MPP రాజవర్ధన్రెడ్డి రోడ్డు ప్రమాద మృతి కేసులో ఆయన కుటుంబానికి రూ. 2.25 కోట్లు నష్టపరిహారం 7.5% వడ్డీతో చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. 2022 ఏప్రిల్ 20న జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు. పిటిషన్పై విచారణ అనంతరం లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
AKP: నర్సీపట్నం కాయగూరలు మార్కెట్లో కేజీ టమాటా ధర దారుణంగా పడిపోయింది. కేజీ కేవలం రూ.5 మాత్రమే ఉండడంతో దారుణంగా నష్టపోతున్నామని పలువురు రైతులు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని పేర్కొన్నారు. రైతు బజార్లో కనీసం కేజీ రూ.10లకు అమ్ముకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
CTR: పులిచెర్ల మండలం మంగళంపేటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మహా సంప్రోక్షణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలత, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. వారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ELR: బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ మనేంద్ర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యర్ధాల నిర్వహణ క్రమ పద్ధతిలో చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను బాధ్యతారహితంగా పడేయకూడదని వాటి వాడకం తగ్గించాలని సూచించారు.
ELR: చింతలపూడిలోని PMSHRI ZP హైస్కూల్లో శుక్రవారం పోలీసులు విద్యార్థినీ, విద్యార్థులకు, మత్తు పదార్థాల నివారణ కొరకు, సైబర్ క్రైమ్, పోక్సో యాక్ట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, డయల్ 112 లేదా స్థానిక పోలీస్ అధికారులను నేరుగా, ధైర్యంగా సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్సై సతీష్ కుమార్ పాల్గొన్నారు.
CTR: పలమనేరు శ్రీ భూనీల కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థాన మహా సంప్రోక్షణ పూజల్లో పలమనేర్ శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి సతీమణి శ్రీమతి రేణుకా రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన నూతన విమాన గోపుర రాజగోపుర మహా కుంభాభిషేక, స్వామి వారి నవీకరణ జీర్ణోద్ధారణ, అష్ట బంధన పూజల్లో ఆమె పాల్గొన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంటలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను టీడీపీ నాయకులు తాయన్న, దాసప్ప రెడ్డి, నరసింహులు, వలి తాతా శుక్రవారం జేసీపీతో ప్రారంభించారు. హరిశ్చంద్రప్ప కాలనీలో వేమారెడ్డి ఇంటి నుంచి తారాపురం నరసింహులు ఇంటి వరకు, లక్ష్మన్న ఇంటి నుంచి బెల్లం బాషా ఇంటి వరకు రెండు రోడ్లను రూ. 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు.
SKLM: ఆమదాలవలసలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.