ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దాదాపు 22వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై మైక్రోసాఫ్ట్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ ఎక్స్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. 100 శాతం ఉద్యోగుల కోత అవాస్తవమని స్పష్టం చేశారు.