• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

మన్యం: జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి శనివారం సీతానగరం మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా పెద్ద భోగిల్లి గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆనంతరం సిబ్బంది హాజరు పట్టిక, వారి కదలిక రిజిస్ట్రార్‌ను నిశితంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బంది సకాలంలో కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు.

April 26, 2026 / 07:13 AM IST

ఇంధన సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు భీమవరం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ తెలిపారు. వరి కోతలు, ఆక్వా సాగు యంత్రాలు, రవాణా వాహనాలకు ఇంధన కొరత లేకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు ఎదురైతే ప్రజలు వెంటనే 8121676653 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

April 26, 2026 / 07:10 AM IST

ఆస్తి పన్ను రాయితీకి ఐదు రోజులే గడువు: కమిషనర్

E.G: ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపులపై రాయితీ పొందేందుకు మరో ఐదు రోజులే గడువు ఉందని కమిషనర్ రాహుల్ మీనా శనివారం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సర పన్నును ఈ నెల 30లోపు ఏకమొత్తంగా చెల్లించే వారికి 5 శాతం రాయితీతో పాటు, పాత బకాయిల వడ్డీపై 50 శాతం మినహాయింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 26, 2026 / 07:07 AM IST

యాడికి మీదుగా కర్నూలుకు బస్సు సర్వీసు

ATP: తాడిపత్రి డిపో నుంచి కర్నూలు వెళ్లే ఆర్టీసీ బస్సులను నేటి నుంచి యాడికి మీదుగా నడుపుతున్నట్లు టీఐ పుల్లయ్య తెలిపారు. గతంలో బస్సులు బైపాస్ మీదుగా వెళ్లడం వల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను స్థానికులు CM చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విన్నపంపై స్పందించిన అధికారులు యాడికి మీదుగా సర్వీసులను పునరుద్ధరించారు.

April 26, 2026 / 07:07 AM IST

అక్రమంగా మద్యం విక్రయం.. వ్యక్తి అరెస్ట్

NLR: సీతారామపురం మండలం బోడసిద్దయ్య పల్లిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వెంకటేశ్వర్లును శనివారం స్పెషల్ స్క్వాడ్ పోలీసులు పట్టుకొని ఉదయగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు ఉదయగిరి ఎక్సైజ్ ఎస్సై దీప్తి కారంత్ తెలిపారు. తన దుకాణంలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

April 26, 2026 / 07:00 AM IST

‘గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి’

గుంటూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. గృహ నిర్మాణాల పురోగతిపై నిన్న సమీక్ష నిర్వహించిన ఆయన, ఇంజనీర్లు, గుత్తేదారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

April 26, 2026 / 06:45 AM IST

నేటి నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ELR: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి మే 3 వరకు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో స్వామివారు ప్రతిరోజూ విశేష అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. 26న మహావిష్ణువు, 27న సత్యకృష్ణుడు, 28న అహల్య శాపవిమోచన, 29న శ్రీనివాస కల్యాణం, 30న మోహిని, మే 1న శ్రీకూర్మ, 2న నవనీతకృష్ణ, 3న శయన మహావిష్ణువు అలంకారాల్లో భక్తులకు కనువిందు చేయనున్నారు.

April 26, 2026 / 06:42 AM IST

నేడు కొండాపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం

KDP: కొండాపురంలో ఓ కంటి ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్యశిబిరం ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు చేస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

April 26, 2026 / 06:35 AM IST

నాటక వేదిక వద్ద ప్రమాదం.. బాలుడు మృతి

BPT: కర్లపాలెం మండలం పేరలిపాడు గ్రామంలో శనివారం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. నాటక ప్రదర్శన ఏర్పాట్ల సమయంలో స్టేజి కిందుగా వెళ్తున్న జోగి లిబ్నిరాజుకు విద్యుత్ తీగలు తగిలాయి. తీవ్రంగా అస్వస్థతకు గురైన అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 26, 2026 / 06:33 AM IST

తాగునీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: హోంమంత్రి

అనకాపల్లి: వేసవిలో పాయకరావుపేట నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి శనివారం సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్య ఎక్కడైనా ఏర్పడితే వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

April 26, 2026 / 06:26 AM IST

మంత్రిని పరామర్శించిన భీమవరం ఎమ్మెల్యే

W.G: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని నాదెండ్ల నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, అక్కడ భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

April 26, 2026 / 06:26 AM IST

PGRSను సద్వినియోగం చేసుకోండి: MRO

TPT: ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలో సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం PGRS కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు MRO చంద్రబాబు తెలిపారు. పిచ్చాటూరు ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు PGRS జరుగుతుందన్నారు. మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై, ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారన్నారు.

April 26, 2026 / 06:25 AM IST

నేరాల నివారణపై గ్రామాల్లో అవగాహన

సత్యసాయి: పరిగి ఎస్సై రవికుమార్ తిరుమల దేవరపల్లి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన చట్టాలు, డ్రగ్స్ నివారణ, మహిళా భద్రత, సైబర్ నేరాల పట్ల ప్రజలకు వివరించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

April 26, 2026 / 06:24 AM IST

రైల్వే గేటు సమస్య పరిష్కరించాలని DRMకు MLA వినతి

PPM: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సీతానగరం మండలం చినబోగిలి రైల్వే గేటు సమస్య పరిష్కరించాలని రైల్వే DRMను కోరారు. శనివారం ఆయనతో కలిసి రైల్వే గేటు పరిశీలించారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి దూరంగా ఉండటం వలన రైతులు, విద్యార్ధులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చిరు వ్యాపారులు కూడా జీవనోపాధి కోల్పోయారని MLA DRM కు వివరించారు.

April 26, 2026 / 06:23 AM IST

హెల్మెట్ ధరించడం భారం కాదు బాధ్యత: SP

SKLM: హెల్మెట్ ధరించడం భారం కాదు, ప్రతి వాహనదారుడి బాధ్యత అని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం “అభయం” పేరిట హెల్మెట్ ధారణపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని అన్నారు. జిల్లా కలెక్టర్, అధికారులు ఉన్నారు.

April 26, 2026 / 06:23 AM IST