CTR: వీ.కోట మండలంలో విలేకరి హత్య ఘటనపై జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దర్యాప్తు కొనసాగుతుండగా, నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరూ నిర్ధారించని సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం: ఒంగోలు శివారులోని ఆలాస్ హోటల్ వద్ద మంగళవారం లారీ డ్రైవర్పై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేసి, బెదిరించి, అతని వద్ద ఉన్న రూ. 2వేల నగదును దోచుకొని పరారయ్యారు. వలేటివారిపాలెంనకు చెందిన శ్రీనివాసరావు చెన్నై వెళుతూ.. బహిర్భూమికి వెళ్లేందుకు లారీని ఆపినప్పుడు ఈ సంఘటన జరిగింది. బాధితుడు ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. గతంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లకూడదంటూ కండీషనల్ బెయిల్ ఇవ్వగా.. ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది. ఈయన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు.
GNTR: తెలంగాణకి చెందిన ఆంజనేయులు, ప్రకాశం (D)కు చెందిన శ్రీనివాసకుమార్ మరికొందరు కలసి చుండూరు (M) చిన పరిమిలోని రామలింగేశ్వరస్వామి ఆలయ గోపుర కలశానికి మహిమలు ఉన్నాయని భావించి 2019లో చోరీ చేసేందుకు యత్నించారు. అప్పటి ఈవో ఫిర్యాదుపై నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. మంగళవారం విచారణలో వీరికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
KDP: ఖాజీపేటలో డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో పలు గ్రామాలలో రబీ కింద వరి పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పంట కోతకొచ్చింది. డీజిల్ కొరత వల్ల వరి కోత యంత్రాలు ముందుకు కదలలేకున్నాయి. డీజిల్ సమస్య కారణంగా యంత్రాలకు పని లేకుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు.
NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గత ఐదు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద డీజిల్, పెట్రోల్ దొరకక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పట్టణంలో ఉన్న పెట్రోల్ బంకులను పరిశీలించారు. డీజిల్ సమస్యలపై మాజీ ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
AKP: నాతవరంలో బుధవారం స్వచ్ఛపదం కార్యక్రమం నిర్వహించారు. నాతవరం నుంచి ఏకే అగ్రహారం వరకు సుమారు 2.5 కి.మీ రహదారి ఇరువైపులా శుభ్రపరిచారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీడీఓ ఎం.ఎస్. శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కే.మూర్తిబాబు, పంచాయతీ కార్యదర్శి బి.చంద్రశేఖర్, మాజీ ఎంపీపీలు కొండబాబు, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
ASR: జిల్లాలో పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 264పాఠశాలలకు చెందిన 11,988మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల వేళ విద్యార్థులు ఆందోళన చెందవ ద్దని, మార్కులు తక్కువ వచ్చినా లేదా ఫెయిల్ అయినా అది జీవితానికి ముగింపు కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఓటమిని విజయానికి తొలిమెట్టుగా భావించి ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.
ATP: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు భారీ జరిమానా విధించింది. నంద్యాల జిల్లాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నరిగ నగేష్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ ప్రభావతి రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
SS: ధర్మవరం పట్టణంలోని మడుగు తేరు వద్ద నిర్వహించిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం భక్తుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి రథోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 6వ వార్డులో వార్డు కౌన్సిలర్ రహమత్ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి, కమిషనర్ చిన బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన అధికారులు దోమల నివారణకు చర్యలు చేపడుతూ స్ప్రే చేశారు. ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.
KKD: జిల్లాలో ఇంధన కొరత లేదని, ప్రజల ఆందోళన వల్ల ఏర్పడిన అధిక కొనుగోళ్లే కృత్రిమ కొరతకు కారణమని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పెట్రోల్ బంకులను పరిశీలించిన ఆయన, రోజువారీ వినియోగం కంటే రెట్టింపు స్థాయిలో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. గల్ఫ్ యుద్ధ ప్రభావం ఉన్నా, ప్రధాని మోదీ చొరవతో ఇంధన దిగుమతులకు ఆటంకం లేదని పేర్కొన్నారు.
ప్రకాశం: దర్శి పట్టణంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, డాగ్ స్క్వాడ్తో కలిసి బస్టాండ్, ఫుడ్ కోర్టులు, బేకరీలలో సోదాలు నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ASR: జీకేవీధి మండలం ఐస్ గెడ్డ సమీప చిత్రకొండ జంక్షన్ వద్ద 32 కిలోల గంజాయి పట్టుబడిందని సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వ మాసూళ్లు లో వరి కోత యంత్రానికి ఎకరాకు 3 వేలు గా వ్యవసాయ శాఖ ఆమోదం తెలిపిందని జిల్లా ADA శ్రీనివాస రావు ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. వీటిని సిబ్బంది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి రైతాంగానికి తెలియజేయాలన్నారు. వాతావరణ అననుకూల పరిస్థితుల ప్రభావం వల్ల రైతుల వద్ద అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు.