• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఈ రైళ్లు తాత్కాలిక రద్దు

ATP: గుంతకల్లు డివిజన్ పరిధిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంతకల్లు-బోధన్ రైలు ఈ నెల 30, 31 తేదీల్లో రద్దయింది. అలాగే గుంతకల్లు-మార్కాపురం రైలును ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో నిలిపివేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని కోరారు.

May 30, 2026 / 07:26 AM IST

తీరనున్న వరద కష్టం.. రూ.5 కోట్లతో వంతెన

కోనసీమ: అప్పనపల్లి-పాసర్లపూడి గ్రామాల మధ్య పాటురేవుపై రూ.5 కోట్ల సీఆర్ఎఎఫ్ నిధులతో అధునాతన వంతెన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దశాబ్దాల నాటి పాత కాజ్వే పూర్తిగా శిథిలం కావడంతో దాన్ని తొలగించి, 60 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో కొత్త వంతెనను నిర్మిస్తున్నారు. గోదావరి వరదల సమయంలో లంక గ్రామాల ప్రజలకు ముంపు సమస్యలు తలెత్తకుండా ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడనుంది.

May 30, 2026 / 07:20 AM IST

ఆటో బోల్తా.. వ్యక్తులకు గాయాలు

అన్నమయ్య: నిమ్మనపల్లె మండలం మర్రిబండ వద్ద శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌తో పాటు ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తీవ్ర గాయాల కారణంగా ఇద్దరిని తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు.

May 30, 2026 / 07:17 AM IST

గంజాయి నిర్మూలనే లక్ష్యం

అనకాపల్లి: గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పరవాడ సీఐ మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం రాత్రి పరవాడ మండలం తిక్కవానిపాలెం గ్రామంలో వందరోజుల యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం అంధకారం అవుతుందన్నారు. గంజాయి గురించి సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలో పోలీస్ స్టేషన్‌కు తెలియ చేయాలన్నారు.

May 30, 2026 / 07:14 AM IST

‘ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి’

NDL: డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భారతి రాంగ్‌రూట్‌లో వెళ్లడంతో మల్యాలకు చెందిన గొర్ల సుంకన్న మృతి చెందినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు ఆరోపించారు. శుక్రవారం మాల్యాలో సుంకన్న పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. ఈ నెల 24న జరిగిన ప్రమాదంలో గాయపడిన సుంకన్న కర్నూలు GGHలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

May 30, 2026 / 07:12 AM IST

చికెన్ వ్యర్ధాలు తరలిస్తే కఠిన చర్యలు: సీఐ

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చికెన్ వర్గాల రవాణా విచ్చలవిడిగా సాగుతుంది. దీంతో సీఐ శ్రీనివాసరావు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కంటైనర్లు చికెన్ వ్యర్ధాలను తరలిస్తున్న వివాహనాన్ని ఎస్సై సంతోష్ రెడ్డితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. ఆక్వా సాగుకు చికెన్ వ్యర్ధాలను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

May 30, 2026 / 07:06 AM IST

ఆకివీడులో పోలీసు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ

W.G: మైసూరు దత్త పీఠాధిపతి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 84వ జన్మదినోత్సవం సందర్భంగా ఆకివీడు దత్తక్షేత్రంలో శుక్రవారం హెల్మెట్ల పంపిణీ చేపట్టారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ఆకివీడు సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులకు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ కాళీచరణ్, ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.

May 30, 2026 / 06:57 AM IST

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి: మందకృష్ణ

E.G: దళిత క్రైస్తవుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ గడువును మరో 6నెలలు పెంచాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో వెనుకబడిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలన్నారు.

May 30, 2026 / 06:48 AM IST

జిల్లాకు ఐదు రోజుల వర్ష సూచన..!

కర్నూలు ఉమ్మడి జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. నేటి నుంచి జూన్ 3 వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. రైతు సోదరులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

May 30, 2026 / 06:44 AM IST

అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

SS: మడకశిర క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నియోజకవర్గ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు, విద్యార్థులు, సామాన్య ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వీటి సత్వర పరిష్కారం కోసం తక్షణమే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

May 30, 2026 / 06:38 AM IST

మహిళా సాధికారతకు టీడీపీనే కేరాఫ్: ఎమ్మెల్యే

GNTR:మహిళా సాధికారతలో ఎప్పుడూ టీడీపీదే ముందంజ అని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి అన్నారు. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని లోకేశ్ ప్రకటించడంతో శుక్రవారం శ్రీనివాసరావుపేటలోని ఆమె కార్యాలయంలో సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలే తమ బ్రాండ్ అంబాసిడర్లని, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

May 30, 2026 / 06:36 AM IST

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఇంఛార్జ్

అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతులను స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.

May 30, 2026 / 06:35 AM IST

169.16 హెక్టర్లలో పంటలకు నష్టం

NLR జిల్లాలో ఇటీవల భారీ గాలులు వీస్తుండడంతో మామిడి, అరటి, నిమ్మ, ఆరంజ్, తమలపాకుల తోటలు 169.16 హెక్టర్లల్లో దెబ్బతిన్నాయి. 118 మంది రైతులు నష్ట పోయారు. దీంతో అధికారులు పంట నష్ట వివరాల ప్రాథమిక అంచనాలు రూపొందించి GOVTకు నివేదికలు పంపినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు.

May 30, 2026 / 06:33 AM IST

కాకినాడ డీఎంఈగా డాక్టర్ విష్ణువర్ధన్ బాధ్యతలు

KKD: రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)గా డాక్టర్ ఏ. విష్ణువర్ధన్ శుక్రవారం విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం పదోన్నతిపై డీఎంఈగా నియమించింది. పలువురు వైద్యులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన వైద్య విద్యారంగంలో సేవలు మరింత మెరుగుపరుస్తారన్నారు.

May 30, 2026 / 06:32 AM IST

రానున్న రోజుల్లో జిల్లాకు మోస్తరు వర్షాలు

ATP: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఒకటి రెండు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 37.2 నుంచి 37.5 డిగ్రీలుగా నమోదు కానున్నాయి.

May 30, 2026 / 06:32 AM IST