KRNL: కౌతాళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో నిర్వహించిన విచారణ తూతూ మంత్రంగానే జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్. ఈరేష్ ఇవాళ విమర్శించారు. విచారణ పూర్తై రోజులు గడిచినా నివేదికను బయటపెట్టకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే నివేదికను వెల్లడించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
PLD: ABN ఆంధ్రజ్యోతి ఛానల్లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేటలో బుధవారం YCP నేతలు ఆందోళన చేపట్టాయి. ఆంధ్రజ్యోతి తీరును నిరసిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజల మద్దతుతో ఈ ఉధ్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
GNTR: సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన 87వ రోజు ప్రజాదర్బార్లో ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి భారీగా వినతులు స్వీకరించారు. అందిన వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
BPT: ముత్తాయపాలెం-కప్పలవారిపాలెం మధ్య నూతన వంతెన పనులను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు బుధవారం పరిశీలించారు. నాగరాజు కాలువపై రూ.14 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. పనుల నాణ్యతను ఆయన పరిశీలించారు. వంతెన పూర్తయితే ప్రజల దశాబ్దాల కష్టాలు తీరతాయన్నారు. ప్రయాణ దూరం తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయని తెలిపారు. గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు.
KDP: ‘Operation Mobi Track’లో భాగంగా కడప పోలీసులు 8వ విడతలో రూ.70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. CEIR పోర్టల్, IMEI ట్రాకింగ్ ద్వారా ఈ ఫోన్లను గుర్తించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 5877 ఫోన్లు రికవరీ చేశారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ATP: అనంతపురం 34వ డివిజన్లోని 74వ సచివాలయాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పది మంది సిబ్బందికి ముగ్గురే ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ విజిట్లో ఉన్న వారికి స్వయంగా ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.
VSP: ఎండాడ, సాగర్నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న భవన నిర్మాణ పనులను మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి యజమానులు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామంలో నిర్వహించిన ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదలను అందజేశారు.
SKLM: గాలి కుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు ఎస్. సూర్యనారాయణ మూర్తి అన్నారు. ఆమదాలవలస మండలం తురకపేట గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
AKP: ఎలమంచిలిలో బుధవారం తూర్పు కాపు జిల్లా కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాకు ముగ్గురు తూర్పు కాపు డైరెక్టర్లను నియమించాలని సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కరణం శ్రీహరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, తూర్పు కాపుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
GNTR: ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మొహమ్మద్ యాకోబ్ మృతిచెందడంతో బుధవారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ వారి నివాసానికి వెళ్లి పార్ధివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం వేముల మండలం పెండ్లూరుకు చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రఘునాథరెడ్డి వారికి పార్టీ జెండాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పులివెందుల నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం బీటెక్ రవి చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం వేముల మండలం పెండ్లూరుకు చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రఘునాథరెడ్డి వారికి పార్టీ జెండాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పులివెందుల నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం బీటెక్ రవి చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.
NDL: బేతంచెర్ల చౌడేశ్వరి మాత కళ్యాణ మండపం ఆవరణలో బుధవారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా మ్యాట్పై నిర్వహిస్తున్న ఈ పోటీలకు 30 జట్లు హాజరయ్యా యి. మాజీ ఎంపీటీసీ బుగ్గన ప్రభాకర్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు వీటిని ప్రారంభించారు. యువకుల కేరింతలు, ఈలల మధ్య కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి.
BPT: బాపట్లలోని ఏబీఎన్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్, మహిళలపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. జిల్లా అధ్యక్షుడు నాగార్జున ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. రాధాకృష్ణ వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయగా, ఈ ర్యాలీని ర్యాలీని పోలీసులు అడ్డుకున్నట్లు వారు తెలిపారు.