కర్నూలు ఉమ్మడి జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. నేటి నుంచి జూన్ 3 వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. రైతు సోదరులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
GNTR:మహిళా సాధికారతలో ఎప్పుడూ టీడీపీదే ముందంజ అని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి అన్నారు. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని లోకేశ్ ప్రకటించడంతో శుక్రవారం శ్రీనివాసరావుపేటలోని ఆమె కార్యాలయంలో సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలే తమ బ్రాండ్ అంబాసిడర్లని, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతులను స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.
NLR జిల్లాలో ఇటీవల భారీ గాలులు వీస్తుండడంతో మామిడి, అరటి, నిమ్మ, ఆరంజ్, తమలపాకుల తోటలు 169.16 హెక్టర్లల్లో దెబ్బతిన్నాయి. 118 మంది రైతులు నష్ట పోయారు. దీంతో అధికారులు పంట నష్ట వివరాల ప్రాథమిక అంచనాలు రూపొందించి GOVTకు నివేదికలు పంపినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు.
KKD: రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)గా డాక్టర్ ఏ. విష్ణువర్ధన్ శుక్రవారం విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం పదోన్నతిపై డీఎంఈగా నియమించింది. పలువురు వైద్యులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన వైద్య విద్యారంగంలో సేవలు మరింత మెరుగుపరుస్తారన్నారు.
ATP: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఒకటి రెండు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 37.2 నుంచి 37.5 డిగ్రీలుగా నమోదు కానున్నాయి.
KDP: సింహాద్రిపురం(M) బిదినంచర్ల గ్రామంలో 110 ఏళ్ల తర్వాత శ్రీయేనే మీద గంగమ్మ తల్లి దేవరను నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ దేవర కార్యక్రమం నేటి నుంచి రెండు రోజులపాటు జరుగుతుంది. శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం దేవర కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
BPT: చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో సాగుతున్న కోడిపందేల స్థావరంపై పోలీసులు శుక్రవారం మెరుపు దాడి చేశారు. ఎస్సై కందుల కృష్ణ తిరుపతిరావు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడుల్లో పందేలు కాస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,250 నగదుతో పాటు రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ: మహిళా రిజర్వేషన్ల అమలు నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో మహిళలు సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ.. మహిళా సాధికారతను ఆచరణలో చూపించిన పార్టీ టీడీపీ పార్టీయేనన్నారు. మహిళల భద్రత, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
PLD: నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు శుక్రవారం కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కలిసి పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ‘కపాస్ కిసాన్ యాప్’ వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్లాట్ బుకింగ్, సాంకేతిక సమస్యలను పరిష్కరించి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
NLR: నెల్లూరులోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ శ్రీధర్ తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్ల మరమ్మత్తులు కారణంగా మూడో మైలు, డి ఎస్ నగర్, ప్రశాంతి నగర్, రాజీవ్ గాంధీ కాలనీ, కిసాన్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
SKLM: మహిళలు, బాలికల భద్రతకు జీరో టోలరెన్స్ పాలసీని ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. DGP ఆదేశాల మేరకు జిల్లాలో ఆపరేషన్ దండయాన్ను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.మహిళల పై నేరాలకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.జిల్లాలో శక్తి బృందాల పెట్రోలింగ్ సేవలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు
GNTR: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేవీపీ కాలనీలో గంజాయి అమ్ముతూ, తాగుతున్న నలుగురు యువకులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.05 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దావీదు, యేసుబాబు, నందు, చరణ్ అంతా కేవీపీ కాలనీకి చెందినవారేనని, వీరిలో కొందరిపై గతంలోనే పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
PLD: దాచేపల్లి తంగెడ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న లారీని, తంగెడ నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నై వెళ్తున్న లారీ డ్రైవర్ తిరుపతి రెడ్డికి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.
TPT: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరిగిన వాహనసేవ వైభవంగా సాగగా, భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. దివ్య కాంతులతో అలరించిన చంద్రప్రభవాహనంపై స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.