• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అక్రిడేషన్ అవకతవకల ఫిర్యాదులపై విచారణ చేయండి’

ATP: జిల్లాలో అక్రిడేషన్ మంజూరులో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సీనియర్ జర్నలిస్టులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీనియర్ జర్నలిస్టులు భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తినే జీవనాధారం చేసుకొని జీవనం సాగిస్తున్నామన్నారు. జర్నలిజం నమ్ముకున్న తమకు న్యాయం చేయాలన్నారు.

April 13, 2026 / 08:00 PM IST

‘పంటలకు అధిక యూరియా వేయవద్దు’

NLR: అల్లూరు మండలంలోని ఇందుపూర్ గ్రామంలో సోమవారం వివిధ పంటల్లో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. పంటలకు అధిక యూరియా వేయకూడదని తెలియజేశారు. మట్టి పరీక్షలు చేసిన తర్వాత, ఫలితాలు ఆధారంగా పంటలకు యూరియా, ఇతర రకాల ఎరువులు వేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఏవో కళారాణి, పీఎసీఎస్ ఛైర్మన్ హరికృష్ణ, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

April 13, 2026 / 08:00 PM IST

భూ రికార్డుల ప్రక్షాళనపై కలెక్టర్ సమీక్ష

సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో సోమవారం రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యంపై తహశీల్దార్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు దాటిన అర్జీలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూ రీ-సర్వే పనులను వేగవంతం చేసి ఏప్రిల్ 30 నాటికి లక్ష్యాలను చేరాలని సూచించారు.

April 13, 2026 / 08:00 PM IST

ఘనంగా తాళ్లూరులో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ

KKD: గండేపల్లి మండలం తాళ్లూరులో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని వైసీపీ గ్రీవెన్స్ సెల్ జాయింట్ సెక్రెటరీ ఒబ్బిడి వీరబాబు ఆవిష్కరించారు. సుమారు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా సేవలందించిన జగజ్జీవన్ రామ్ వ్యవసాయ, కార్మిక రక్షణ రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చారని వక్తలు కొనియాడారు.

April 13, 2026 / 08:00 PM IST

పత్తికొండ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

KRNL: పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ తెలిపారు. సోమవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పత్తికొండ చెరువును పరిశీలించి నీటి నిల్వలను సందర్శించారు. చెరువులోని ముళ్ల పొదలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా 68 చెరువులను నింపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

April 13, 2026 / 07:50 PM IST

పోక్సో కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్

ప్రకాశం: సింగరాయకొండ మండలానికి చెందిన పోక్సో కేసు నిందితుడు సురేష్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం సెక్షన్ 8 కింద అతడిపై కేసు నమోదైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసు తీవ్రతను పరిశీలించిన సింగరాయకొండ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ వివరాలను SI మహేంద్ర మీడియాకు వెళ్లడించారు.

April 13, 2026 / 07:44 PM IST

‘రాజకీయాలకు అతీతంగా సహకార సంఘాలు పనిచేయాలి’

VZM: రాజకీయాలకు అతీతంగా సహకార పరపతి సంఘాలు రైతులకు సేవలందించాలని DCCB ఛైర్మన్‌ కిమిడి నాగార్జున స్పష్టం చేశారు. ఇవాళ గుర్ల మండలం కెల్ల PACSను సందర్శించి సంఘం గోదాములు, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల సేవలో సంఘాలు పనిచేయాలని సూచించారు. ఆయనతో పాటు సంఘం అధ్యక్షురాలు విమల రాణి, నాయకులు గోవింద్‌ ఉన్నారు.

April 13, 2026 / 07:40 PM IST

స్కూటీని ఢీకొన్న బస్సు.. మహిళ మృతి

విశాఖలోని రామా టాకీస్ వద్ద స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వెనుక ఉన్న మహిళ బస్సు చక్రల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది.హైదరాబాద్‌కు చెందిన రోజా రాణి తన అన్నకు ఆపరేషన్ జరిగిందని తెలుసుకొని విశాఖ వచ్చి పరామర్శించి తమ్ముడితో స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందినట్లు సమాచారం. త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 13, 2026 / 07:40 PM IST

PGRS కార్యక్రమానికి 153 అర్జీలు

NTR: కలెక్టర్ డా.జీ. లక్ష్మీశ ప్రజల అర్జీలు పెండింగ్ లేకుండా గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాస్థాయి PGRSలో 153 అర్జీలు స్వీకరించి వాటి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల సంతృప్తే సేవల నాణ్యతకు ప్రమాణమని ఆయన పేర్కొన్నారు.

April 13, 2026 / 07:33 PM IST

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహావిష్కరణ

సత్యసాయి: ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో సోమవారం మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని మంత్రి సత్య కుమార్ ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. దేశానికి అంకితభావంతో సేవలందించిన మహానేత వాజపేయి ఆశయాలు, నాయకత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి కృషి చేయడం ఆ మహనీయునికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.

April 13, 2026 / 07:30 PM IST

పేరూరు డ్యాంకు నీరు విడుదల చేయాలి: తోపుదుర్తి

ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆరు మండలాల నాయకులతో కలిసి పేరూరు డ్యాంకు వెంటనే నీరు విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ మోహన్ రెడ్డి చొరవతో డ్యాంకు నీరు అందించి రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు.

April 13, 2026 / 07:30 PM IST

స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా అలహరి శ్రీనివాస్

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్ విభాగంలో డీఎస్పీగా అలహరి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ కార్యాలయ సిబ్బంది, ఫీల్డ్ సిబ్బంది కూడా అభినందనలు తెలియజేశారు.

April 13, 2026 / 07:29 PM IST

కొమరోలు క్రాస్ రోడ్డు వద్ద ఆటో బోల్తా.. మహిళ మృతి

ప్రకాశం: కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రాస్ రోడ్ వద్ద తాటిచెర్ల మోట నుంచి కొమరోలు వైపు వస్తున్న ఆటో సోమవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న మొరం సుబ్బమ్మ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. మృతి చెందిన సుబ్బమ్మది మదనపల్లె గ్రామం అని సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న మరొక ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

April 13, 2026 / 07:24 PM IST

ఫైర్ క్రాకర్స్ విక్రయదారులతో జేసీ సమీక్ష

PLD: జిల్లాలో ఫైర్ క్రాకర్స్ లైసెన్స్ దారులతో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గడువు ముగిసిన వారు వెంటనే రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. వేసవి కాలంలో షాపులు, క్రాకర్స్ నిల్వలో భద్రతా జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

April 13, 2026 / 07:23 PM IST

26 పరీక్షా కేంద్రాలు.. 8,053 మంది విద్యార్థులు

VZM: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని KC సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 25న జరిగే పరీక్షకు జిల్లాలో నుంచి 8,053 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

April 13, 2026 / 07:20 PM IST