KDP: చెన్నూరు మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలను నాటారు.ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.