KDP: పంటల సాగులో రైతులకు ప్రకృతి వ్యవసాయమే లాభసాటిగా ఉంటుందని మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. వేముల మండలం వి కొత్తపల్లిలో శనివారం సాయంత్రం ఘన జీవామృతం తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఘన జీవామృతం పంటలకు అందించడం వల్ల మంచి దిగుబడులు వస్తాయన్నారు.