అన్నమయ్య: యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టమైన పని కూడా విజయవంతం అవుతుందని రాజంపేట సబ్ కలెక్టర్ నిధియా దేవి అన్నారు. శనివారం రాజంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పనికూడా సులభం అవుతుందన్నారు.