నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నగరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో శనివారం దగదర్తి మండల టీడీపీ నేత మాలేపాటి సుబ్బ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. కావలి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలపై ఎంపీ వేమిరెడ్డి సానుకూలంగా స్పందించారు.