కడప: మైలవరం మండలం వేపరాల గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతుల మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి చౌడేశ్వరిదేవి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు.