CTR: ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. గుడిపాలలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో కంపెనీలను ఆహ్వానించి, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారన్నారు. నేషనల్ హైవేతో రైతుల భూములకు విలువ పెంచుతున్నారని, శాశ్వత తాగునీటి సమస్యకు చర్యలు చేపడుతున్నారన్నారు.