తనకు రెండు వేల కోట్ల ఆస్తులున్నాయని నిరూపించాలన్నారు. అదే నిజమైతే అందులో 50కోట్లు ఇస్తే మొత్తం రాసిస్తానన్నారు. తన దగ్గర ఉందంటున్న రూ.1950 కోట్లతో రాప్తాడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారా అంటూ సవాల్ విసిరారు.
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వేధింపులు ఎక్కువ అయ్యాయని ఫ్యాషన్ డిజైనర్ శోభారాణి అంటున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని.. తనకు ఆత్మహత్య శరణ్యం అంటున్నారు.
కోకాపేట(Kokapet)లో భూమి(lands) అమ్మితే.. లెక్కలేనంత డబ్బు వస్తుందని తులసి సినిమాలో కోకాపేట ఆంటీ పదహారేళ్ల కిందే చెప్పగా.. ఇప్పుడు అదే నిజమైంది. హెచ్ఎండీఏ(HMDA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-వేలంలో కోకాపేట భూములు హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా.. ఆల్టైం రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఒక్క ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పైగా వచ్చాయి.
ఓ యువకుడు కూల్డ్రింక్లో మద్యం కలిపి డ్రింక్ ఓ మహిళకు ఇచ్చాడు. తరువాత ఆమెపై లైంగికదాడి చేశాడు. అంతే కాకుండా ఫోటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్మొయిల్ చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawankalyan) వారాహి మూడో విడత యాత్ర షెడ్యూల్ కు ముహూర్తం ఫిక్సైంది. ఈ యాత్ర విశాఖ జిల్లాలో ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానుంది. జనసేన నాయకత్వం ఈ మేరకు నిర్ణయించింది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ విశాఖ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. మూడో విడత యాత్ర జరిగేది విశాఖ జిల్లాలో అని క్లారిటీ ఇచ్చారు. దీంతో విశాఖ జనసైనికులలో జోష్ నెలకొంది.
దారితప్పి గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి కుక్కల భయానికి చెట్టు ఎక్కింది. దీంతో ప్రజలు భయపడి దాన్ని అడవిలోని పంపించాలని చేసిన ప్రయత్నాలు జరగలేదు. రాత్రి వరకు అటవిశాఖ అధికారులు, గ్రామస్తులు దాని కావాలి ఉన్నారు.