W.G: నరసాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో మాట్లాడి రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.