కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్లో శనివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, కడప జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ శ్రీ కె. శ్రీనివాస రెడ్డిని, జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఎస్పీ పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు.