PLD: టిడ్కో గృహ సముదాయాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగటానికి వీలులేదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం చిలకలూరిసపేటలో ఉచిత తాగునీటి ప్లాంటును ఎమ్మెల్యే, ఎంపీ లావు కృష్ణదేవరాయలుతో కలిసి ఆయన ప్రారంభించారు. 5,520 ఇళ్లల్లో నివాసముండే వారికి త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాల అందుబాటులోకి తెస్తామన్నారు.