సత్యసాయి: కదిరిలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నేడు నిత్య పూజా కైంకర్యాలు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతాయని అర్చకులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అభిషేక, స్వర్ణకవచ సేవలు నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 వరకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.