కృష్ణా: నూజివీడు మండలం పోలసానపల్లిలో రహదారిపైనే నీటి గుంత ఏర్పడింది. స్థానికులు గృహాల్లో వాడిన నీరు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో తారు రోడ్డుపైకి వచ్చి చేరుతోంది. దీంతో వాహనాల ధాటికి నీరు చేరిన తారు రోడ్డు గుంతలు పడి ధ్వంసం అవుతుందని, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోయారు. రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.