KKD: ప్రత్తిపాడు(మం) పెద శంకర్లపూడి టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే వరుపుల ప్రభ ఆధ్వర్యంలో సీవీఏపీ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం రూపొందిస్తున్న పీ4 కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర నివేదికలు తయారు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.