KDP: గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 2432 టిడ్కో ఇళ్లను ప్రజలకు పంపిణీ చేయలేదని కడప ఎమ్మెల్యే మాధవి ఆరోపించారు. కడపలోని లక్ష్మీ నగర్లో టిడ్కో ఇళ్లకు రోడ్ పనులను ఆమె ప్రారంభించారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న టీడీపీ హయాంలో ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం ఇళ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందిస్తామని తెలిపారు.