KDP: విద్యార్థులు సమాజ సేవలో చురుగ్గా పాల్గొనాలని పులివెందుల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీఎన్ డాక్టర్ రాచకుంట నాగరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు జాతీయ సేవా పథక దినోత్సవాన్ని కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. 1969 సెప్టెంబర్ 24న ప్రారంభమైన ఈ పథకం యువజన కార్యక్రమమని, విద్యార్థులు కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.