TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద టీటీడీ బోర్డ్ సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.