ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి వారి ఆదివారం ఆదాయం రూ. 2,43,998లు వచ్చినట్లు ఈవో నరసింహ బాబు సోమవారం తెలిపారు. అందులో దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ. 86,520లు, ప్రసాదం విక్రయం ద్వారా రూ. 29,660లు అన్నదానానికి విరాళాల ద్వారా రూ. 76,722లు, స్వామివారి శ్రీపాద కానుకల ద్వారా రూ. 18000లు పంచామృతభిషేకానికి రూ. 33096 వచ్చిందని ఈవో తెలిపారు.