CTR: పాలసముద్రం మండల నూతన ఎస్సైగా రాజశేఖర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణ బదిలీల్లో భాగంగా నారాయణవనం నుంచి బదిలీపై వచ్చానని అన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. మండలంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.