TPT: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 నుంచి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం 77,893 మంది స్వామి వారిని దర్శించుకోగా 24,604 మంది తలనీలాలు సమర్పించారు. రూ.3.53 కోట్ల ఆదాయం హుండీ ద్వారా వచ్చిందని టీటీడీ ప్రకటించింది.