Pawan Kalyan: బ్రేకింగ్ న్యూస్.. పవన్ కల్యాణ్‌పై రాయి దాడి

పవన్ కల్యాణ్‌పై రాయి దాడి జరిగింది. దీనికి సంబంధించిన వార్త సంచలనం సృష్టిస్తుంది.

  • Written By:
  • Updated On - April 14, 2024 / 07:04 PM IST

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభలో చేదు సంఘటన జరిగింది. వారాహి యాత్రలో భాగంగా తెనాలి చేరుకున్నారు పవన్ కల్యాణ్. ప్రచారం ప్రారంభించిన పవన్ కల్యాణ్‌పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. అయితే ఆ రాయి పవన్‌కు తగలకుండా దూరంగా పడింది. దాంతో ఊపిరి పీల్చుకున్న జనసైనికులు ఆ రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్నారు. అక్కడే పోలీసులు బందోబస్తు ఉండడంతో వారికి అతన్ని అప్పగించారు. తెనాలి వచ్చిన పవన్‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హెలిప్యాడ్ వద్ద పవన్‌కు స్వాగతం పలికారు. అతనితో పాటే గుంటూరు పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు.

చదవండి:Kommareddy Pattabhiram: సీఎంపై దాడి డ్రామాలో హీరో జగనే!

Related News

Pawan Kalyan: అప్పటి నుంచే OG షూటింగ్‌లో పవన్?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమాల కంటే, రాజకియంగానే వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే.. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, మరో 20 రోజుల్లో రిజల్ట్స్ రానున్నాయి. దీంతో.. ఓజి షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.