ప్రకాశం: జరుగుమల్లి మండలంలోని కామేపల్లిలో ప్రసిద్ధిగాంచిన పోలేరమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అభిషేకాలు, కుంకుమ పూజ, గోత్ర నామార్చనలు, వాహన పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీవారు ప్రత్యేక చర్యలు చేపట్టారు.