ప్రకాశం: పొదిలిలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం సందర్బంగా నగర పంచాయితీ కమిషనర్ పి శ్రీనివాసులు, ఎంఆర్ఓ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు అవగాహనా కల్పించారు. ఓటు యెక్క విలువ ఎంతో ప్రాధాన్యమైనదని, ఓటుతో మంచి నాయకులను ఎన్నుకోవచ్చని వివరించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.