కృష్ణా: గంపలగూడెం, గోసవీడు, ఊటుకూరు నెమలి, తునిగిపాడు, ఆర్లపాడు తదితర గ్రామాల్లో శనివారం ఉదయం సామాజిక పింఛన్ పంపిణీ ప్రారంభించారు. పెనుగొలనులో సచివాలయ, పంచాయతీ, ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ నగదును అందజేశారు. ప్రభుత్వ సూచనలు అనుసరించి ఉదయం 7 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.