శ్రీకాకుళం: నగరంలోని విజయగణపతి ఆలయంలో అర్చకులు శనివారం ఉదయం పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ పుష్పాలతో స్వామిని అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు.