KRNL: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు పెద్దకడబూరు మండలంలోని మద్యం, మాంసం దుకాణాలను బంద్ చేయాలని ఎస్సై నిరంజన్ రెడ్డి సూచించారు. దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవంగా జాతీయ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా పెద్దకడబూరులోని వైన్ షాపులు, చికెన్, మటన్ షాపులు, వివిధ గ్రామాల్లో మాంసం దుకాణాలను బంద్ చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.