KDP: ప్రమాదవశాత్తు, సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు బీమా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బాదుల్లా పేర్కొన్నారు. ఆదివారం కడపలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు చనిపోయిన కార్మికుల కుటుంబాలు అందరికీ సహాయం అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.