TPT: ప్రతి సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ మౌర్య తెలిపారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.