KKD: మహాశివరాత్రి ఉత్సవాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామ క్షేత్రంలో బుధవారం ఈవో బల్ల నీలకంఠం అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా, పూర్తి భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.