KDP: విద్యాసంస్థల మాటునా భూ దోపిడి చేస్తూ, చెరువులను స్వాహా చేస్తున్న రాజంపేట అన్నమాచార్య విద్యాసంస్థలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, TNSF జిల్లా అధ్యక్షుడు పోలి శివకుమార్ తెలిపారు. మంగళవారం రాజంపేటలో వారు మాట్లాడుతూ.. చెరువు తొట్టిలను కబ్జా చేసి భవనాలు నిర్మించారని ఆరోపించారు.