E.G: రాబోయే రోజుల్లో రాజమండ్రి నగరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం రాజమండ్రిలోని గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్లో జరిగిన లెజెండ్స్ కప్-2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు.