ప్రకాశం: బల్లికురవ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి తహశీల్దార్ రవి నాయక్ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు అనేది చాలా విలువైనదని అన్నారు. దానిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.