GNTR: మొంథా తుపాను ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) అప్రమత్తమైంది. నగరంలో 72 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. సోమవారం రాత్రికి 112 మంది ఈ కేంద్రాలకు చేరుకోగా, నోడల్ అధికారులు వారికి వసతులు కల్పించారు. తుపాను సంబంధిత సమస్యల సహాయం కోసం 08632345103 కు ఫోన్ చేయాలని కమిషనర్ సూచించారు.