E.G: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలోని వై.జంక్షన్ నుంచి ఆనం కళా కేంద్రం వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డి.నరసింహా కిశోర్, జేసీ ఎస్.చిన్న రాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన గార్గ్, డీఆర్వో టి.సీతారామ మూర్తి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.