TPT: పాకాల మండలం సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేళాడుతుండగా, మరో మహిళ డెడ్ బాడీ నేలపై ఉంది. అవి గుర్తు పట్టలేనంతగా మారినట్లు పోలీసులు తెలిపారు. అక్కడే మరో రెండు గుంతలు తవ్వి, వాటిపై బండరాళ్లను ఉంచారు. ఆ గోతిలో చిన్న పిల్లల మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.