తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, లక్ష కుంకుమార్చన చేస్తారు. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల తిరువీధి ఉత్సవం జరుగుతుంది.