CTR: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 12 మందిపై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జ్ కుమారి ఉమాదేవి శనివారం జరిమానా విధించారు. ఈ మేరకు ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున మొత్తం ₹1.20 లక్షల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం రహదారి భద్రత కోసం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు.