NDL: పట్టణం రైల్వే కాలనిలోని కోదండ రామాలయం నందు రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో గీత జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భగవద్గీత పారాయణం చేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. గత 14 సంవత్సరాలుగా గీతా జయంతిని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.