GNTR: నగరపాలక సంస్థలో సోమవారం (ఏప్రిల్ 7) పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు జనన మరణ నమోదు కార్యాలయం (పార్కింగ్ వద్ద) నిర్వహిస్తామని జిఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. అదే రోజున కౌన్సిల్ హాల్లో వార్షిక బడ్జెట్ సమావేశం జరుగనున్నందున ఈ స్థల మార్పు జరిగిందన్నారు.