ప్రకాశం: కంభం పట్టణంలోని పలు దుకాణాల్లో సోమవారం ఎంపీడీవో వీరభద్రాచారి ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంలో భాగంగా తగ్గిన నిత్యావసర వస్తువుల ధరలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.