PPM: జిల్లాలోని ప్రతీ ఒక్కరూ ఎయిడ్స్పై అవగాహన చెందాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. హెచ్ఐవి/ఎయిడ్స్, మాదకద్రవ్య దుర్వినియోగం పట్ల యువతలో అవగాహన పెంపొందించేందుకు యూత్ ఫెస్ట్,2025 ఐఇసి మారథాన్ 5కే రెడ్ రన్ కార్యక్రమం మంగళవారం దిశా ఆద్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ ముందుగా జ్యోతిని వెలిగించి, జెండా ఊపి 5కే రన్ను ప్రారంభించారు.