ATP: గుంతకల్లు ప్రముఖ వ్యాపారవేత్త యూసుఫ్ ఖాన్ మాతృమూర్తి బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వారి నివాసానికి వెళ్లి ఆమె భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు.