E.G: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తగరం సురేష్బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం శనివారం జరిగింది. బాబాసాహెబ్ సేవలను గుర్తించి భరతరత్న బహుమతి బీజేపీ ప్రభుత్వం ఇవ్వడాన్ని నాయకులు ప్రస్తావించారు. సీనియర్ నాయకులు రంగ బాబు, కందికొండ రమేష్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.